డీజీపీకి చంద్రబాబు లేఖ.. వైసీపీ గూండాలపై చర్యలు తీసుకోండి

-

కుప్పంలో ఐటీడీపీ కార్యకర్త మురళిపై దాడి చేశారంటూ ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ఐటీడీపీ కార్యకర్త మురళీని వైసీపీ గూండాలు అక్రమంగా నిర్బంధించారని.. మురళీపై హత్యాయత్నానికి పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలి శిథిలావస్థకు చేరాయని.. ప్రాథమిక హక్కుల పట్ల గౌరవం లేకపోవడంతో ఆటవిక రాజ్యం తలపిస్తోందని ఫైర్ అయ్యారు. దోషులపై చర్యలు తీసుకోవాలని.. టీడీపీ సానుభూతిపరులపై పదే పదే హింసాత్మక దాడులు జరుగుతున్నప్పటికీ , దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు.

వైసీపీ నేతలు, గూండాలు ఓ వర్గం పోలీసులతో కుమ్మక్కై ప్రతిపక్ష టీడీపీ నేతల ప్రజాస్వామిక గొంతుకను నొక్కేస్తున్నారని అగ్రహించారు. కుప్పం ఐటీడీపీ క్రియాశీల సభ్యుడు మురళిని 20 డిసెంబర్ 2021 మధ్యాహ్నం 1.55 గంటలకు వైసీపీ నేతలు కుప్పంలో కిడ్నాప్ చేశారని.. మురళిని నేరుగా రెస్కో చైర్‌పర్సన్ జిఎస్ సెంధిల్ కుమార్ ఇంటికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించారని లేఖలో పేర్కొన్నారు.

మురళికి కుడి కన్ను దగ్గర అతని ముఖం మీద గాయాలయ్యాయని.. 20 డిసెంబర్ సాయంత్రం 6.30 గంటల సమయంలో సెంధిల్ కుమార్ ఇంటి నుండి రెండు కార్లు, రెండు బైక్‌లలో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల బెదిరింపు కారణంగా మురళి భయపడి 23 డిసెంబర్ 2021 వరకు ఈ ఘోరమైన సంఘటనను నివేదించలేదని.. భవిష్యత్తులో మురళిపై ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మండిపడ్డారు. ఘటన పై పోలీసులు విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. మురళికి భద్రత కల్పించడానికి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల సత్వర చర్య మాత్రమే రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించబడుతుందని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news