పదవులు మారిస్తే లీడర్లను తక్కువ చేసినట్లు కాదు – వై వి సుబ్బారెడ్డి

-

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల మార్పు, చేరికలపై టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు మార్చినంత మాత్రాన ఆ లీడర్లను తక్కువ చేసినట్లు కాదని చెప్పారు. మరోచోట వినియోగించుకోవాలని పార్టీ ఆలోచనగా తెలిపారు. అలాగే పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియ అన్న ఆయన.. వైసీపీలో ఎవరైనా చేరవచ్చునని అన్నారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ అమలు దినోత్సవ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి వై వి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే 2014 – 19 మధ్య చంద్రబాబు పాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఇక నారా లోకేష్ పాదయాత్రను ఉద్దేశిస్తూ.. పాదయాత్రలు ఎవరైనా చేసుకోవచ్చని, అయితే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికే 95% నెరవేర్చారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news