రూటు మార్చి అల్లరి నరేష్.. తప్పు చేశాడా..?

-

కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన అల్లరి నరేష్ తాజాగా నటించిన చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. ఈ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన యావరేజ్ రివ్యూ వచ్చినా..కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా విఫలమైందని చెప్పవచ్చు. ఈ సినిమాతో పోల్చి చూస్తే అల్లరి నరేష్ గత సినిమాలు చాలా బెటర్ గా కలెక్షన్లను సాధించాయని వార్తలు కూడా వైరలవుతున్నాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ కి కామెడీ సినిమాలు సూటైన స్థాయిలో సీరియస్ సినిమాలు సూట్ కావని ఫ్యాన్స్ చెబుతూన్నారు. అయితే నాంది సినిమా దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఒక కొత్త యాంగిల్ ప్రదర్శించడంతో హిట్టయిందే తప్ప ఇలాంటి సీరియస్ యాక్షన్ సినిమాలు అల్లరి నరేష్ కి సెట్ కావు అని కూడా చెబుతున్నారు.

కామెడీ సినిమాలతోనే మెజారిటీ సందర్భాలలో సక్సెస్ పొందిన నేపథ్యంలో అల్లరి నరేష్ ఆ దిశగా అడుగులు వేస్తేనే సరైన సక్సెస్ అందుకుంటాడు అని.. ఇప్పుడు సీరియస్ జోనర్ వైపు తన రూటు మార్చి తప్పు చేశాడు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అల్లరి నరేష్ సినిమాలు మరీ దారుణంగా వసూళ్ళను సొంతం చేసుకుంటూ ఉండడంతో ఇండస్ట్రీ వర్గాలకు షాక్ తగిలిందని చెప్పాలి. ముఖ్యంగా కొత్త డైరెక్టర్లను కాకుండా క్రేజ్ వున్న డైరెక్టర్ల దర్శకత్వంలో నటిస్తే అల్లరి నరేష్ కెరీర్ బాగుంటుందని మరికొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

నరేష్ కి ఆఫర్లు వస్తున్నాయి.. కానీ క్రేజ్ మాత్రం తగ్గుతుంది.. సరిగ్గా దృష్టి పెట్టాలని.. అలా లేని నేపథ్యంలో పూర్తిగా డిజాస్టర్ అయ్యి ఇండస్ట్రీకి దూరం కావాల్సి ఉంటుంది అని కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఇకనైనా రూటు మార్చి కథ ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకొని.. ప్రేక్షకుల ముందుకు వస్తాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news