ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత..

-

ఢిల్లీ సరిహద్దులోని టిక్రీలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రాక్టర్లతో పెరేడ్ నిర్వహించడానికి రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. అయితే ర్యాలీగా వెళుతున్న రైతులను పోలీసులు టిక్రీ వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రైతు సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. అంతే కాక పోలీసులు అడ్డం పెట్టిన బారికేడ్లను తొలగించి రైతులు ముందుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాక్టర్ ల తోటి ఢిల్లీ లోపలికి వెళ్ళడానికి రైతులు ప్రయత్నం చేయడం ఇప్పుడు పోలీసులకు టెన్షన్ గా మారింది.

రైతులు ఇలాంటిది ఏదో ఒకటి చేస్తారు అని భావించి రోడ్డుకు అడ్డంగా పెట్టిన కంటైనర్ ని కూడా రైతులు ట్రాక్టర్ తో పక్కకు నెట్టడం సంచలనంగా మారింది. అదే ఇప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపే ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఇప్పుడు రైతులు బారికేడ్లను తొలగించి ముందుకు వస్తున్న కారణంగా రైతుల పై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news