BREAKING : రేపటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా

-

ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లా పర్యటనలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. రేపటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా పడింది. మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని తెలిపారు అధికారులు.

కొండగట్టుకు మంగళవారం… భారీగా అంజన్న భక్తులు వస్తారన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని తెలిపారు అధికారులు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టింది. ఇక ఇప్పుడు ప్రసిద్ధి దేవాలయాలైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టు అంజన్న కోవెల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news