గుంటూరులో రిగ్గింగ్ వీడియో… బయటపెట్టిన వైసీపీ..!

-

టీడీపీ నేతలు దౌర్జన్యాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నార‌ని, యధేచ్ఛగా ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తూ… రిగ్గింగ్‌కు పాల్ప‌డుతున్న‌ట్లు వైఎస్సార్సీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో రిగ్గింగ్ వీడియోలు త‌మ వ‌ద్ద‌ ఉన్నాయ‌ని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు.


పోలింగ్ బూతు 218 లో టవైఎ్సీపీ ఏజెంట్ల‌ను బ‌య‌ట‌కు పంపించి రిగ్గింగ్ చేస్తున్నారని ఈ త‌తంగాన్నంత వీడియోలు తీస్తున్న త‌మ‌పై పోలీసులు, టీడీపీ కార్య క‌ర్త‌లు దౌర్జ‌న్యం వైసీపీ నేత‌లు తెలిపారు.అయితే ఓట‌ర్ల జాబితాలో చ‌నిపోయిన వారి ఓట్లు, ఓటు వేయ‌డానికి రాని వారి ఓట్ల‌ను వేస్తున్నార‌ని, దీనికి పోలీసులు కూడా స‌హ‌క‌రిస్తున్నార‌ని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news