కరోనా కల్లోలం.. చైనాలో మరో సారి లాక్ డౌన్

-

చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ కారణంగా… మన ఇండియా తో పాటు చాలా దేశాలు ఆర్థికంగా కుదేలు అయ్యాయి. అటు చైనా దేశం కూడా కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయింది. అయితే కరోనా మహమ్మారి తగ్గిందా అనుకునే సమయంలోనే… మరోసారి చైనా దేశంలో విలయం సృష్టిస్తోంది.

చైనాలోని పలు నగరాలలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే దేశీయంగా కోవిడ్ వైరస్ స్ట్రైక్ అరికట్టేందుకు దాదాపు 40 లక్షల జనాభా ఉన్న లాన్​ జౌ నగరంలో లాక్ డౌన్ విధించింది.

అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు చూసింది ప్రభుత్వం. చైనా లోని వాయువ్య ప్రావిన్స్ గన్స్ రాజధాని అయిన లాన్​ జౌ లో తాజాగా ఆరు కేసులు నమోదు అవ్వగా… చైనా వ్యాప్తంగా సోమవారం 29 కేసులు నిర్ధారణ అయ్యాయి. మన దేశంతో పోలిస్తే.. ఆ 29 కేసులు తక్కువే అయినప్పటికీ… ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోంది చైనా. ఇందులో భాగంగానే తాజాగా లాన్​ జౌ నగరంలో లాక్ డౌన్ విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news