మాణిక్యాలరావు మృతిపై చిరంజీవి దిగ్బ్రాంతి..!

-

బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు మరణ వార్తతో విషాదానికి లోనయ్యానని చిరంజీవి పేర్కొన్నారు. ఓ సామాన్యుడిలా రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవులు చేపట్టే స్థాయికి ఎదిగారని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.

కాగా, మాణిక్యాల రావు కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన దాదాపు నెల రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన ఆసుపత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. మాణిక్యాల రావు చంద్రబాబు మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఆయన మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news