మీడియాపై చిరంజీవి సీరియస్…కంపు చేస్తున్నారు !

-

నిన్న హైదరాబాద్‌ లో గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే..ఈ గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో మీడియా పై చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాన్ఫిడెంట్ తగ్గించేలా వస్తున్న వార్తలు చిరాకు కలిగిస్తున్నాయని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

తామేం చేయాలో కూడా మీడియా నే నిర్ణయిస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్షం పడినప్పటికీ తన స్పీచ్ కొనసాగించాలని వివరించారు. ఒకవేళ తాను అలా స్పీచ్ ఇవ్వకపోతే మీడియా మరోలా వార్తలు రాసి కంపు చేసేదని, తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా మీడియా వ్యవహరించడం దారుణం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news