ఏపీ మహిళలకు సీఎం జగన్ బిగ్ షాక్ !

-

ఆంధ్రప్రదేశ్ మహిళలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. చెల్లెమ్మలకు ఇస్తానన్న వైయస్సార్ పెళ్లి కానుక పథకాన్ని మూలన పడేసింది ఏపీ సర్కార్. రెండేళ్లుగా వధువులకు కానుక అందడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాక… సీఎం అయిన తర్వాత ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కారని విమర్శలు వస్తున్నాయి.

గతంలో టీడీపీ హయాం లో అమలులో ఉన్న పెళ్లి కానుక పేరును మార్చి… వైయస్సార్ పెళ్లి కానుక పేరుతో ఆర్బాటంగా మళ్లీ పథకాన్ని ప్రారంభించింది జగన్మోహన్రెడ్డి సర్కార్. ఆయా కులాలకు చెందిన పెళ్లి కూతురు లకు ఇవ్వాల్సిన మొత్తాన్ని పెంచింది. ఇది జరిగి రెండేళ్లకు పైగా అయినా ఈ పథకం అమలుకు మోక్షం కలగలేదు. దీంతోపాటు కులాంతర వివాహాలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం లేదు జగన్ సర్కార్. ఎన్నికల కోడ్, లోటు బడ్జెట్, కరోనా పేరుతో ఈ పథకాన్ని అమలు చేయడం లేదు జగన్ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news