కుప్పం ఓటమి తర్వాత.. చంద్రబాబు ముఖం ఒక్కసారి చూడాలి : జగన్ చిరకాలక కోరిక

-

ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. కుప్పం, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఏసీ లో ప్రస్తావన వచ్చింది. సభకు చంద్రబాబును తీసుకు రండి.. కుప్పం ఫలితాలు తర్వాత ఆయనను చూడాలని ఉందని సీఎం జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. గెలుపొటములు సర్వ సాధారణమేనన్న అచ్చెన్నాయుడు…. చంద్రబాబు సభకు కచ్చితంగా వస్తారని స్పష్టం చేశారు.

chandrababu naidu ys jagan

బీఏసీలో ఎన్నికల ప్రస్తావన దేనికి..? ఎన్నికల్లో ఎలా గెలిచారో అందరికీ తెలుసని అచ్చెన్న వైసీపీకి చురకలు అంటించారు. సభకు చంద్రబాబు వచ్చేలా చూడాలని ఒకటికి రెండు సార్లు అచ్చెన్న వద్ద ప్రస్తావించారు జగన్. కుప్పం గురించి మాట్లాడేందుకు చాలా ఉన్నాయన్నారు సీఎం జగన్. కుప్పం ఎలా గెలిచారో మీకూ తెలుసు.. మాకూ తెలుసని సమాధానం ఇచ్చారు అచ్చెన్న. కాగా.. తెలుగు దేశం పార్టీ విజ్ఙప్తి మేరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వ తేదీ వరకు పొడగించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news