ఏపీ నూతన గవర్నర్ కు సీఎం జగన్ శుభాకాంక్షలు

-

ఏపీకి కొత్త గవర్నర్ నియామకం అయ్యారు. పలు రాష్ట్రాల గవర్నర్లను తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ తరుణంలోనే ఏపీకి కొత్త గవర్నర్ వచ్చారు. ఏపీ కొత్త గవర్నర్ గా ఎస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. అబ్దుల్‌ నజీర్… సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా గతంలో పని చేశారు. ప్రస్తుత ఏపీ గవర్నమెంట్ విశ్వ భూషణ్ హరిచంద్రను చత్తీస్‌ ఘడ్‌ గవర్నర్ గా బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిపుణులైన జస్టిస్ నజీర్ అనుభవం ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడంలోనూ, రాష్ట్రానికి చక్కటి మార్గ నిర్దేశం చేయడంలో ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news