ఇవాళ ప్రధాని మోడీతో జగన్ కీలక సమావేశం

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్ మోహన్‌ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే…. ఇవాళ ఉదయం 11 గంటల సమయం తర్వాత తాడేపల్లి నుంచి ఢిల్లీకి బయలు దేరనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి. ఇక ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాల పరిష్కారంపై ఈ సందర్భంగా అభ్యర్థించనున్నారు సీఎం జగన్.

అలాగే.. కేంద్ర ఆర్ధిక శాఖ, ఏవియేషన్ మంత్రులనూ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అందుబాటులో ఉన్న పలువురు ఇతర కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఢీల్లీకి బయలుదేరిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి… ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి తో పాటు పార్టీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి, పలువురు ఇతర ఎంపీలు వెళ్ళనున్నారు. తాజాగా బీజేపీ ప్రజాగ్రహ సభ చేపట్టిన నేపధ్యంలో పీఎం మోదీ సీఎం జగన్ భేటీ కి ప్రాధాన్యత ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news