నేడు తూర్పుగోదావరి జిల్లాకు సీఎం జగన్‌..షెడ్యూల్‌ ఇదే

-

నేడు తూర్పుగోదావరి జిల్లాకు సీఎం జగన్‌ వెళ్లనున్నారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో “గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్రైవేట్ కంపెనీ ” యూనిట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌… ముఖ్యమంత్రి పర్యాటనకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి 10.05 కి తాడేపల్లి లోని హెలిప్యాడ్ కి చేరుకొని, 10.10 కి హెలికాప్టర్ ద్వారా బలభద్రపురంకి బయలుదేరుతారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

ఉదయం 10.50 కి బలభద్రపురం హెలిప్యాడ్ కి చేరుకుంటారు. అనంతరం ఉ.11. 00 కి బయలుదేరి 11.05 గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్లాంట్ కి చేరుకొని, ప్రత్యేక వాహనం లో 11.05 నుంచి 11.20 వరకు ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియా ఛైర్మన్ ఆదిత్య బిర్లా తో కలిసి ప్లాంట్ ను సందర్శన చేశారు. తదుపరి 11.20 కి ప్రధాన సభా వేదికకు చేరుకుంటారు. 11.25 నుంచి మధ్యాహ్నం .12.25 మధ్య “గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్రైవేట్ కంపెనీ యూనిట్” ప్రారంభోత్సవ కార్యక్రమం లో భాగంగా శిలాఫలకం ఆవిష్కరణలో పాల్గొననున్నారు. గ్రాసిం పరిశ్రమలో రోజుకు 400 టన్నుల కాస్టిక్ సోడా ఉత్పత్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news