నేడు సతీసమేతంగా పారిస్​ వెళ్లనున్న సీఎం జగన్..కారణమిదే ​

-

అమరావతి : నేడు సతీసమేతంగా విదేశాలకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు సీఎం క్యాంపు ఆఫీసు షెడ్యూల్‌ ను విడుదల చేసింది. నేడు రాత్రి ఏడు గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం జగన్ దంపతులు… 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి పారిస్ కు బయలుదేరనున్నారు.

భారతీయ కాలమానం ప్రకారం 29 ఉదయం పారిస్ కు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి దంపతులు. జూలై 2వ తేదీన పెద్ద కుమార్తె హర్షా యూనివర్సిటీ కాన్వొకేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు సీఎం జగన్, సతీమణి భారతి.

ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ ఇన్సీడ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు జగన్ కుమార్తె వైఎస్ హర్షా రెడ్డి. ఇక ఈ కార్య క్రమం అయిపోయిన అనంతరం.. అంటే.. జూలై 3వ తేదీన తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి దంపతులు.

Read more RELATED
Recommended to you

Latest news