చంద్రబాబు ఏడుపు పెద్ద డ్రామా.. రాజకీయాల కోసమే : జగన్ సెటైర్

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ, ప్రెస్‌ మీట్‌ లో ఎడవటం పై సీఎం జగన్‌ అసెంబ్లీలో సెటైర్లు వేశారు. చంద్రబాబు కళ్లల్లో నీళ్లు లేకపోయినా… నీళ్లు వచ్చాయని డ్రామా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఏడుపు పెద్ద డ్రామా అని… అన్ని రాజకీయాల కోసమేనని మండిపడ్డారు సీఎం జగన్‌. దేవుడి దయ, ప్రజల దీవెన ఉన్నంత కాలం.. ఎల్లో మీడియా ఏం చేయలేదన్నారు సీఎం జగన్‌.

chandrababu naidu ys jagan

మనం మంచి చేసేంద కాలం దేవుడు ఆశీర్వదిస్తాడని… ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టీవీ 5 లాంటి మీడియా సంస్థలు నాకు లేవన్నారు. చిన్నాన్న వివేకాను ఎవరన్నా ఏమన్నా చేసుంటారంటే.. అది టీడీపీ వాళ్లే చేసుండాలన్నారు. రైతుల చర్చలో విపక్ష సభ్యులు లేకపోవడం దుర దృష్టకరమన్నారు. చంద్రబాబు సంబంధం లేని విషయాలను తీసుకు వచ్చి రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి రంగ హత్య, మాధవ రెడ్డి హత్య చంద్రబాబు హాయంలోనే జరిగాయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనేక ఆరోపణలు చేస్తున్నారని.. ఏం జరిగిందో అనేది దేవుడు చూస్తున్నాడని తెలిపారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news