రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి సీఎం జగన్ రేపు దేశ రాజధాని ఢిల్లీ కి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల సమయం లో ఢిల్లీ కి వెళ్ళనున్నారు సీఎం జగన్‌. ఎల్లుండి వామపక్ష తీవ్ర వాదం పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వం లో సమావేశం జరుగనుంది. అమిత్‌ షా నేతృత్వంలో జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.

jagan
jagan

ఈ కీలక సమావేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రo, ఆంధ్ర ప్రదేశ్, ఒడిస్సా, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే రేపు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఢిల్లీకి పయనం కానున్నారు. అలాగే.. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబరు 26 న సమావేశం జరుగనుంది.  ఈ సమావేశంలోనూ సీఎం జగన్ పాల్గొననున్నారు. కాగా.. అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ… సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news