ఈనెల 30న మదనపల్లికి సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 30 వ తేదీన అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పర్యటన ఖరారైంది. 30వ తేదీన ఉదయం 9 గంటలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి బయలుదేరి 9:30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు.

అక్కడ నుంచి హెలికాప్టర్లో 11:10 గంటలకు మదనపల్లి బీటీ కళాశాలకు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడినుండి 11:30 గంటలకు టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు. సీఎం జగన్ పర్యటనకు రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version