ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు

-

హానుమకొండ లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్శహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకరరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా 15,16,17 తేదీ లలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.

దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రగతిని ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. 3 రోజుల పాటు అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనాలని వెల్లడించారు. 17వ తేదీన సర్వమత ప్రార్థనలు నిర్వహించాలని.. ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు.

బండి సంజయ్ కి విద్యుత్ బిల్ పై అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చిన దానిని చదువుతున్నాడని.. ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఆ క్రెడిట్ ఆర్మీకి వస్తుంది కానీ… బీజేపీకి ఎందుకు వస్తుందని నిలదీశారు. దేశాన్ని సంస్కారవంతమైన దేశంగా మార్చడానికి తెరాస పార్టీ పనిచేస్తుందని చెప్పారు. .

Read more RELATED
Recommended to you

Latest news