IND vs NZ : హైదరాబాద్ గడ్డపై పూనకాలు తెప్పించిన టీమిండియా

-

ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ విజయం సాధించింది. 350 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ జట్టు సగం వికెట్లను కోల్పోయింది. 25 ఓవర్లకు కివీస్ 5 వికెట్లను కోల్పోయి 130 పరుగులు చేసింది.ఇక చివరి ఓవరలో సెంచరీ వీరుడు మైఖేల్ బ్రేస్‌వెల్ ఔట్ కావడంతో.. 337 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 12 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

ఇక అంతకుముందు కివీస్ ఓపెనర్లు తడబడ్డారు. ఓపెనర్ డేవాన్ కాన్వే పరుగులకే సిరాజ్ బౌలింగ్ లో వెనుదిరగగా, దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికి హేన్రి నీకొల్స్, గ్లేన్ ఫిలిప్స్ వెను వెంటనే అవుట్ అయ్యారు. టార్గెట్ సగం ఫినిష్ చేయకముందే కివిస్ సగం వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో టీమిండియా గెలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news