ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన

-

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీ పర్యటన నేటితో ముగిసింది. గత శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… పర్యటనను ముగించుకొని.. హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. కాసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్ పోర్టు చేరుకున్న సీఎం కేసీఆర్…. హైదరాబాద్ బయల్దేరారు. సాయంత్రం 6 గంటల సమయానికి హైదరాబాద్ చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

ఇక శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్… వరుస భేటీలతో… బిజీ అయ్యారు. శనివారం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సుదీర్ఘంగా చర్చలు సీఎం కేసీఆర్… సాగునీటి ప్రాజెక్టులు, తెలుగు రాష్ట్రాల వివాదాలపై చర్చించారు. ఆ తర్వాత రోజున వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన భేటీలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

ఆ తర్వాత రోజున కేంద్ర మంత్రి పియుష్ గోయల్ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లలో… భేటీ అయిన సీఎం కేసీఆర్… తెలంగాణ రాష్ట్ర సమస్యలపై చర్చించారు. ఇంకా ఈ చర్చలు సఫలం కావడంతో… ఇవాళ తెలంగాణకు తిరుగు ప్రయాణం అయ్యారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news