ఎంతో మంది నా క్లాస్‌మేట్స్ ఉన్న సిరిసిల్ల ఇది : కేసీఆర్‌

-

రాజ‌న్న సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద స‌భ‌లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. సిరిసిల్లలో నేత‌న్నలు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్ద‌ని రాసిన రాత‌ల‌ను చూసి చలించిపోయాన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. స‌మైక్య రాష్ట్రంలో మ‌న‌కు ఎందుకు ఈ బాధ‌లు అని బాధ‌ప‌డ్డామ‌ని కేసీఆర్ గుర్తు చేశారు. నా 70 ఏండ్ల జీవితంలో సిరిసిల్లలో క‌నీసం ఓ 170 సార్లు తిరిగాను అని కేసీఆర్ గుర్తు చేశారు. ఇక్క‌డ బంధుత్వాలు, ఆత్మీయ‌త‌లు, ఎంతో మంది నా క్లాస్‌మేట్స్ ఉన్న సిరిసిల్ల ఇది. హెలికాప్ట‌ర్‌లో వ‌స్తుంటే అప్ప‌ర్ మానేరు నుంచి సిరిసిల్ల వ‌ర‌కు ఒక స‌జీవ జ‌ల‌ధార‌గా మారింది. సంతోసంగా ఉంది.

TS Formation Day CM KCR Speech : 'సత్తువ ఉన్నంత వరకు రాష్ట్ర ప్రగతి కోసం  శ్రమిస్తూనే ఉంటా', ts-formation-day-cm-kcr-speech-telangana-formation-day-cm -kcr-speech-2023-cm-kcr-on-telangana-formation-day

నేను చిన్న‌ప్పుడు మోటార్ బైక్ మీద‌, సైకిల్ మీద ముస్తాబాద్ నుంచి వ‌స్తే బ్ర‌హ్మాండంగా మానేరులో నీళ్లు క‌నిపించేవి. కానీ స‌మైక్య పాల‌న‌లో దుమ్ములేసే ప‌రిస్థితి వ‌చ్చింది. పోతుగ‌ల్లు గ్రామం పైన గూడూరు అనే ఊరు ఉండేది. ఆ ఊరికి మా అక్క‌ను ఇచ్చాం. అక్క‌డ అప్ప‌ర్ మానేరు కాలువ‌లో నేను ఈత కొట్టాను. నా కండ్ల ముందే పోత‌గ‌ల్లు గ్రామంలో 15 నుంచి 20 రైస్ మిల్స్ వ‌చ్చాయి. స‌మైక్య పాల‌కుల దాడి, దోపిడీ పెరిగాక‌.. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో అవి మాయ‌మైపోయాయని కేసీఆర్ పేర్కొన్నారు.

స‌మైక్య రాష్ట్రంలో అప్ప‌ర్ మానేరు అడుగంటి పోయింద‌ని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టులోనే తెలంగాణ ఉద్య‌మ స‌భ జ‌రిపిన ప‌రిస్థితిని చూశాం. ప్రాణం పోయినా స‌రే రాష్ట్రం రావాలి. వ‌చ్చిన రాష్ట్రం స‌జీవ జ‌ల‌ధారల‌తో క‌ళ‌క‌ళ‌లాడాల‌ని క‌ల‌లు క‌న్నాం. అప్ప‌ర్ మానేరు ఎండాకాలంలో కూడా మ‌త్త‌డి దుంకుతుంటే సంతోషంగా ఉంది. ఉద్య‌మ సంద‌ర్భంలో జ‌య‌శంక‌ర్ నాతో క‌లిసి తిగిరిగేవారు. ఓరోజు మ‌ధ్య రాత్రి సిరిసిల్ల నుంచి హైద‌రాబాద్ వెళ్తున్నాం. ఆత్మ‌హ‌త్య‌లు ప‌రిష్కారం కాదు.. చావ‌కండి అని రాయించారు. ఆ రాత‌లు చూసి క‌న్నీళ్లు పెట్టుకున్నాం. స‌మైక్య రాష్ట్రంలో మ‌న‌కు ఎందుకు ఈ బాధ‌లు అని బాధ‌ప‌డ్డాం. ఇక్క‌డ ఎంపీగా వ‌స్తే ఆద‌రించి గెలిపించారు. ఒక రోజు హైద‌రాబాద్‌లో పేప‌ర్ తిరిగేస్తే ఏడుగురు కార్మికులు చ‌నిపోయారు. ఎంపీగా ఉన్న నేను చ‌లించి, చేనేత పెద్ద‌మ‌న‌షుల‌కు ఫోన్ చేసి ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నాను. పార్టీ డ‌బ్బుల ద్వారా కొంత ఫండ్ స‌మ‌కూర్చి దండం పెడుతా చ‌నిపోవ‌ద్ద‌ను అని వేడుకున్నాను. కానీ పూర్తి రిజ‌ల్ట్ రాలేదు.. కానీ కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించింది అని కేసీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news