షుగర్, BP పేషెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త

-

తెలంగాణ రాష్ట్రంలోని షుగర్ మరియు బిపి పేషెంట్లకు సీఎం కేసీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. పైలట్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం రెండు జిల్లాలలో షుగర్ మరియు బిపి అలాగే క్యాన్సర్ బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మందుల కిట్ పంపిణీ చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు మునుగోడు జిల్లా ఈ లిస్టులో ఉన్నాయి.

అయితే ఈ ఉచిత మందుల పంపిణీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని కెసిఆర్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. త్వరలోనే దీన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీం ప్రకారం .. ప్రతి నెలకు సరిపడే… మందులను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటికి వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసి ఆ తర్వాత మందులు ఇస్తారు. ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే.. పేదలకు మంచి జరుగుతుందని యోజనలో కేసీఆర్ సర్కారు ఉంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా చేసేందుకు సిద్ధం అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news