నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్… షెడ్యూల్ ఇదే

-

కేసీఆర్‌ ప్ర‌భుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేవాలయం యాదాద్రి. అయితే.. ఈ యాదాద్రి ఆల‌య ఉద్ఘాట‌న ఇవాళ జ‌ర‌గ‌నుంది. గ‌త వారం రోజుల నుంచి బాలాల‌యంలో పంచ‌కుండాత్మ‌క మ‌హాయాగంలో మ‌హాపూర్ణాహ‌తి నిర్వ‌హించారు. దీంతో నేడు ఉద్ఘాట‌న జ‌ర‌గ‌నుంది. ఉద‌యం 9:30 గంట‌ల‌కు బాలాల‌యం నుంచి జ‌రిగే శోభాయాత్ర‌తో ఉద్ఘాట‌న ప్రారంభం అవుతుంది.

శోభాయాత్ర వ‌స్తున్న క్ర‌మంలోనే మ‌హా కుంభ సంప్రోక్షణ చేప‌డ‌తారు. అలాగే ఉద‌యం 11 : 55 గంట‌ల‌కు మ‌హోత్స‌వం జ‌ర‌గ‌నుంది. అయితే ఈ మహోత్తరమైన కార్యక్రమానికి ఇవాళ సీఎం కెసిఆర్ కుటుంబ సమేతంగా పాల్గొంటున్నారు.

ఇవాళ ఉదయం 10 గంటలలోపే.. సీఎం కేసీఆర్‌ కుటుంబం యాదాద్రికి చేరనుంది. ఇక సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో.. ఆయనకు ఘన స్వాగతం పలుకనున్నారు ఆలయ అధికారులు, టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు. ఇవాళ సాయంత్రం వరకు సీఎం కేసీఆర్‌ యాదాద్రిలోనే మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news