BREAKING : కొండగట్టు అంజన్న ఆలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

-

BREAKING : కొండగట్టు అంజన్న ఆలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపటికి నిజమే కొండగట్టు కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంజన్న స్వామి దర్శించుకున్నారు. కొండగట్టు ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్.. స్వాగతం పలికినస్వాగతం పలికారు.

కాగా, సీఎం రాక నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని చిరు వ్యాపారుల దుకాణాలను కూడా పోలీసులు మూసివేశారు. అంతకు మునుపు గంగాధర మండలం రేలపల్లికి చెందిన 9 మందిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. గతంలో చర్లపల్లి బలవంతపూర్ మీదుగా తమ గ్రామానికి రోడ్డు వేయిస్తామని స్థానిక ఎమ్మెల్యే మాట ఇచ్చి తప్పడంతో సీఎం ముందు తమ నిరసన తెలిపేందుకు గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news