BBC ఆఫీసుల్లో రెండో రోజు ఐటీ సర్వే.. ఉద్యోగులకు కంపెనీ మెయిల్

-

బీబీసీ కార్యాలయాల్లో రెండో రోజు ఐటీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతోందన్న అనుమానంతో దిల్లీ, ముంబయిలోని కార్యాలయాల్లో ఈ సర్వే కొనసాగిస్తున్నారు. ఐటీ సర్వే నేపథ్యంలో బీబీసీ తన సిబ్బందికి మెయిల్‌ చేసింది. ఐటీ అధికారులకు ఉద్యోగులు సహకరించాలని, వారు అడిగిన ప్రశ్నలకు సమగ్రంగా సమాధానం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం.

జీతం గురించి అడిగిన ప్రశ్నలకు బదులివ్వాలని, వ్యక్తిగత ఆదాయం గురించి స్పందించకుండా ఉండొచ్చని ఆ మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. బ్రాడ్‌కాస్ట్ విభాగం వారు కార్యాలయాలకు రావాలని, మిగిలిన సిబ్బంది ఇంటి నుంచి పనిచేయాలని చెప్పింది. అలాగే ఈ సర్వే గురించి సామాజిక మాధ్యమాల్లో స్పందించవద్దని ఇదివరకే సిబ్బందికి సంస్థ స్పష్టం చేసింది.

గుజరాత్‌ అల్లర్లలో మోదీ హస్తం ఉందని ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ పేరిట రెండు భాగాలుగా ఇటీవల విడుదలైన డాక్యుమెంటరీలో బీబీసీ పేర్కొంది. అల్లర్లపై న్యాయస్థానాల్లో మోదీకి క్లీన్‌చిట్‌ లభించాక ఇలా అభాండాలు వేయడమేమిటని బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలోనే ఐటీ శాఖ మంగళవారం రంగంలోకి దిగింది. 2012 నుంచి ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పరిశీలనను సోదాలు కాదు.. సర్వే అని ఐటీ విభాగం పేర్కొనడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news