BREAKING : ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ సమావేశం ప్రారంభం

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన కాసేపటి క్రితమే టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశం ప్రగతి భవన్ లో జరుగుతోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో… లోక్ సభ అలాగే రాజ్యసభలో టిఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సందర్భంగా ఖరారు చేయనున్నారు గులాబీ బాస్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, అలాగే కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై టిఆర్ఎస్ పార్టీ ఎంపీలకు నివేదికలు సీఎం కేసీఆర్ అందించనున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయసభల్లో టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు… కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథా పై సీఎం కేసీఆర్ ఎంపీలకు సూచనలు, ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇక ఈ సమావేశానికి తెలంగాణ పార్లమెంటు సభ్యులతో పాటు మంత్రులు కూడా హాజరు అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news