పాలమూరుకు గతంలో ఏ ప్రభుత్వమే నీళ్లివ్వలే… : సీఎం కేసీఆర్

-

ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ నగర్ కర్నూల్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని గుర్తు చేశారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాకు చేసిన అభివృద్ధిని ఈ సందర్భంగా మరోసారి ప్రజలతో పంచుకున్నారు. ఒకప్పుడు ఇదే పాలమూరు జిల్లా తాగునీరు మరియు సాగునీరు కోసం అష్టకష్టాలు పడిందని… చెప్పారు. నేను అధికారంలోకి రాకముందు రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని పాలించాయి. నాకన్నా బలంగా , ఎత్తుగా ఉన్నవాళ్లు ఈ జిల్లాకు మంత్రులుగా మరియు అధికారులుగా ఉన్నారు.

కానీ వారిలో ఎవరైనా మీకు నీళ్లిచ్చారా ? లేదే నేను ఇచ్చాను అంటూ గర్వంగా తలెత్తి ఈ సభలో సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ రోజు BRS ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ భగీరథ అనే పధకం ద్వారా కృష్ణమ్మ నీళ్లు వస్తున్నాయి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news