మరియమ్మ లాకప్‌డెత్‌పై కేసీఆర్ సీరియస్.. విచారణకు ఆదేశం.. బాధితులకు రూ. 15 లక్షల పరిహారం

-

హైదరాబాద్: మరియమ్మ లాకప్ డెత్‌పై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. విచారణ చేపట్టాలని డీజీపీకి ఆదేశించారు. నిజ నిర్దారణ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించాలని డీజీపీని ఆదేశించారు. ఎస్సీ మహిళ లాకప్‌డెత్ అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వం సహించబోదని సీఎం హెచ్చరించారు.

మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్‌కు ప్రభుత్వం ఉద్యోగమిస్తామని పేర్కొన్నారు. మరియమ్మ కుమారుడికి డబుల్ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. మరియమ్మ కుమారుడికి రూ. 15 లక్షల పరిహారం చెల్లిస్తామన్నారు. మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. డీజీపీ చింతకాని వెళ్లి విచారణ చేపట్టాలన్నారు. డీజీపి స్వయంగా బాధితులను పరామర్శించి రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

 

ఎస్సీల పట్ల సమాజ దృక్పథం మారాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఎస్సీలు, పేదల పట్ల పోలీసులు ఆలోచన ధోరణి మారాలన్నారు. ఎస్సీలపై చేయిపడితే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. ఎస్సీలకు అన్యాయం జరిగితే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news