బిగ్ బ్రేకింగ్; ఏపీలో 25 జిల్లాలు “కెసిఆర్ ప్రకటన”

-

ఆంధ్రప్రదేశ్ లో 25 జిల్లాలకు సంబంధించి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణా అసెంబ్లీ లో ప్రసంగించిన ఆయన ఏపీ లో కొత్త జిల్లాల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో అవసరానికి మించి ఎక్కువ జిల్లాలను ఏర్పాటు చేశారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సీఎం కేసీఆర్… ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల గురించి మాట్లాడారు.

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ప్రజలకు లబ్ది జరిగిందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మాత్రమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకోలేదని అన్నారు. మిగతా అన్ని రాష్ట్రాలు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాయని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేసారు. తెలంగాణ ఏర్పడి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా మేలు జరిగిందని ఏపీ ప్రభుత్వం భావిస్తోందన్న కెసిఆర్… త్వరలోనే అక్కడి ప్రభుత్వం కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతోందని కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ అంశంపై ఏపీ సీఎం జగన్‌తో తాను మాట్లాడానని చెప్పిన ఆయన, తనకున్న సమాచారం మేరకు ఏపీ ప్రభుత్వం త్వరలోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతోందని కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో జిల్లాల సంఖ్య 25కు చేరే అవకాశం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news