తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడ పన్నావ్ : కెసిఆర్ ఫైర్

-

తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్. తెలంగాణ ఉద్యమంలో నువు ఎక్కడ పన్నావ్ ? నీ ఉనికి తెలంగాణ సమాజానికి తెలియదని బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. నిన్న మొన్న వచ్చి మాట్లాడుతున్నావ్… రాష్ట్రంలో ,దేశంలో నువు ఎవడికి తెలుసని అగ్రహించారు కెసిఆర్.

తెలంగాణ లో ప్రభుత్వ పథకం అందని ఇళ్ళు లేదని మండిపడ్డారు కెసిఆర్. రాయలసీమ కు నీళ్లు రావాలని బజాప్త చెప్పానని.. . ఇప్పుడు అదే చెప్తున్నానని స్పష్టం చేశారు. కృష్ణ నదిలో నీళ్లు లేవని.. గోదావరిలో నీళ్లు ఉన్నందున మిము సహకరిస్తమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వనికి చెప్పానని వెల్లడించారు. 20 ఏళ్ల నుండి రాష్ట్రంలో అనేకమంది కిరికిరి గాళ్లను చూస్తున్నానని మండిపడ్డారు.

సమాధానం చెప్పే స్థాయి, సబ్జెక్టు లెనోడు పిచ్చి కూతలు కుస్తారని బండి సంజయ్ కి చురకలు అంటించారు. వడ్లు వేయమని తెలంగాణ రైతులను గందరగోళంలోకి నెట్టడం సరికాదన్నారు. 6 హెలికాప్టర్‌లు పెట్టి 62 లక్షల ఎకరాల్లో వరిపంట చూపిస్తా.. బండి సంజయ్‌ వస్తావా..? రా.. చూపిస్తా..! నువ్వే కాదు నీ వెంట కేంద్ర మంత్రిని, అధికారులను తెచ్చుకో అని సవాల్ విసిరారు కేసీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news