తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్‌..మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు !

-

పాకిస్థాన్ కంటే కేసీఆర్‌ దారుణంగా మాట్లాడుతున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ లో నన్ను ఓడ గోడతారా అని అహంకార పూరితంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబానికి ఉద్యమ కారులతో సహా అందరూ బానిసలుగా నే ఉండాలి తప్ప.. ఎదురు మాట్లాడకూడదన్నారు.

సీఎంగా కేసీఆర్ తీరు దిగజారుడుగా దివాళా తనంగా ఉందని ఆగ్రహించారు. అబద్దాలు మాట్లాడడం, భయపట్టియడం,  రాజ్యాంగానికి విరుద్ధంగా హింస ను ప్రేరేపిస్తున్నారు.. అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోందని విమర్శించారు. కేసీఆర్ మాట్లాడినట్టు పాకిస్తాన్ కూడా మాట్లాడలేదన్నారు. బీజేపీకి, కేంద్రానికి శత్రువులు ఎవరు లేరు…. కేవలం ప్రత్యర్థులు మాత్రమేనని తేల్చి చెప్పారు. పాకిస్థాన్ మాత్రం తమకు శత్రువేనని చెప్పారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా విద్యుత్ సబ్సిడీలు కొనసాగుతున్నాయని.. కేసీఆర్ గారు మీరు రైతులకే కాదు వ్యాపారులకు , గృహాలకు ఉచిత విద్యుత్ ఇవ్వండి మాకు అభ్యంతరం లేదని చెప్పారు. సీఎంగారు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు…. మీరు చావాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మీటర్లు పెట్టాలనే ఆలోచన మా ప్రభుత్వంకి లేదని కుండ బద్దలు కొట్టారు. యూరియా మీద సబ్సిడీ కేంద్రమే ఇస్తుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news