రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం కేసీఆర్

-

శ్రీశైలం పర్యటన ముగించుకొని హైదరాబాద్ హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ కి చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. కెసిఆర్ తో పాటు సిఎస్ సోమేశ్ కుమార్, పోచారం శ్రీనివాస్, గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. బొల్లారంలోని శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి నగరానికి రాగా.. శాలువా కప్పి ఆహ్వానించారు సీఎం కేసీఆర్.

అంతకుముందు ఢిల్లీ నుంచి రాకింపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రి సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. అయితే మొదటగా రాష్ట్రపతికి ఆహ్వానం పలకడానికి కేసీఆర్ వస్తారని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. ఇక రాత్రికి రాజ్ భవన్ లో గవర్నర్ ఏర్పాటు చేసిన డిన్నర్ కి హాజరవుతారు రాష్ట్రపతి.

Read more RELATED
Recommended to you

Latest news