మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ ఏకగ్రీవ ఎన్నిక

-

మణిపూర సీఎంగా బీరెన్ సింగ్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు ఇంఫాల్ లో జరగిన మణిపూర్ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో మణిపూర్ తాత్కాలిక సీఎంగా ఉన్న బీరెన్ సింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల మణిపూర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 60 స్థానాలకు గానూ… 32 స్థానాల్లో గెలుపొందింది. దీంతో ఇప్పటికే మణిపూర్ రాష్ట్రంలో సీఎం ఎన్నికపై బీరేన్ సింగ్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిశారు. 

తాజాగా ఈరోజు పార్టీ దూతలుగా వెళ్లిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, మరో మంత్రి కిరణ్ రిజిజు మణిపూర్ వెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో ఏకగ్రీవంగా బీరెన్ సింగ్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని నిర్మలా సీతారామన్ అన్నారు. అందరు ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం అని ఆమె అన్నారు. సీఎంగా ఎన్నికైన బీరెన్ సింగ్ ను కేంద్ర మంత్రులు సత్కరించారు.

Read more RELATED
Recommended to you

Latest news