రేపు సీఎం వైయస్‌ జగన్‌ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటన

-

రేపు సీఎం వైయస్‌ జగన్‌ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఇందులో భాగంగానే రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌.

10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకోనున్న సీఎం జగన్‌.. 10.45 – 12.15 గంటల వరకు సీఎం బహిరంగ సభ ఉండనుంది. అనంతరం వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం సహాయం విడుదల చేస్తారు సీఎం జగన్‌. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news