నేడు సాయంత్రం హైదరాబాద్ కు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా

-

ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా రానున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో పాల్గొనేందుకు వస్తున్న సింథియా.. మూడు రోజుల పాటు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటన, బస చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, లబ్ధిదారులు,మేధావులతో సమావేశంకానున్న జ్యోతిరాధిత్య సింథియా… తాజ్ ఫలక్ నామ లో బస చేయనున్నారు.

రేపు 11 గంటలకు హైదరాబాద్ పార్లమెంట్ కోర్ కమిటి సమావేశం కానుండగా.. రేపు 12 గంటలకు హైదరాబాద్ జిల్లా పార్టీ పదాధికారుల సమావేశం ఉంది. 12.45కి మీడియా సమావేశం నిర్వహించనుండగా.. 2 గంటలకు గౌలిపురా ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు సిందియా.

సాయంత్రం 5 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయానికి కేంద్రమంత్రి వెళ్లనుండగా.. సాయంత్రం 6 గంటలకు రాజస్థాన్ భవన్ లో ఐటి, సోషల్ మీడియాతో సమావేశం కానున్నారు సిందియా. శనివారం ఉదయం 7 జిల్లాల మోర్చాల అధ్యక్షులతో సిందియా సమావేశం, శనివారం ఉదయం 11 గంటలకు కార్వాన్ లో మొదటి సారి ఓటు వేయనున్న యువతతో సమావేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news