గ్రూపు 1 పై సీఎం కీలక ప్రకటన.. నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ

-

తెలంగాణ గ్రూప్-1 పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. TGSPSC పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే 1:50 రేషియోలో ఉద్యోగాల భర్తీ ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు కొందరు 1:100 పిలవాలని కోరుతున్నారు. తమకేం ఇబ్బంది లేదు పిలవడానికి.. కానీ కోర్టుల్లో ఇబ్బంది ఎదురవుతుందనిన సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్ 1 వ్యవహారం మళ్ళీ మొదటికి వస్తుంది. నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగానే ఉద్యోగాల భర్తీ ఉంటుందని తేల్చి చెప్పారు.

ఏ పరీక్ష రాయలేనోడు ఉద్యోగాలు వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. నిన్న మొన్న దీక్ష చేసిన ముగ్గురు.. ఏ ఒక్క పరీక్ష రాసిన దాఖలాలు లేవని అన్నారు. ఏ ఉద్యోగానికి పరీక్ష రాయలేనోడు.. పరీక్షలు వాయిదాలు వేయాలని దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు. ఇదొక విచిత్రమైన పరిస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం తెలిపారు. ఇప్పటివరకు ఎప్పుడూ ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్లు వస్తాయో.. ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో తెలియదన్నారు. ఇక నుంచి అలా ఉండదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news