గుడ్ న్యూస్ : త్వరలోనే ఆర్టీసీలో కారుణ్య నియామకాలు

-

కరోనా కారణంగా మృతి చెందిన ఉద్యోగుల వారసులకు త్వరలో కారుణ్య నియామకాలు చేపడతామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు. ఆర్టీసీ హౌస్ లో శనివారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు పాల్గొని మాట్లాడారు.

ఉద్యోగం నుంచి వివిధ కారణాలతో వైదొలిగిన వారికి రావలసిన ఆర్థిక ప్రయోజనాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని ఆయన సూచనలు చేశారు. కొత్త ఏడాది లో ఆర్టీసీ సంస్థలో వ్యయాన్ని నియంత్రించి ఆదాయం పెంచడంపై ఉద్యోగులు దృష్టిసారించాలని సూచనలు చేశారు. పొరుగు రాష్ట్రాల రవాణా సంస్థల తో పోటీపడి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన వివరించారు. త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని కూడా ప్రకటన చేశారు ద్వారకా తిరుమల రావు. ఆంధ్ర ప్రదేశ్ ఆ ర్టీసీ సంస్థను లాభాల బాటలో నడుపాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news