అక్కడ కుక్క కరిస్తే రూ.10 వేల పరిహారం

-

మామూలుగా ఊరిలో, పట్టణాల్లో గ్రామ సింహాలు అదేనండీ.. కుక్కలు ఉండటం సహజం. అయితే.. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తూ దారినపోయేవారిని కరుస్తుంటాయి. దీంతో లబోదిబోమంటూ.. ఆసుపత్రికి పోయి కుక్క కరిచిన ప్రాంతం చుట్టూ ఇంజెక్షన్‌లు మన సొంత ఖర్చుతోనే పొడిపించుకోవాలి. అయితే మన దేశంలోనే ఓ రాష్ట్రంలో కుక్క కరిస్తే పరిహారం అందజేస్తున్నారు. అదే కర్ణాటక రాష్ట్రం.. బెంగళూరు పాలికెలో కుక్క కరిచిందని దరఖాస్తు చేసుకుంటే పరిహారం కూడా లభిస్తుంది. వీధి కుక్క కరిస్తే బీబీఎంపీ పరిహారం అందించే విషయం చాలామందికి తెలియదు. దీంతో గత ఏడేళ్లలో 32 వేలమందికి పైగా కుక్కకాట్లుకు గురైనప్పటికీ అక్షరాలా 25 మంది మాత్రమే పరిహారం తీసుకున్నారు.

What Should You Know If a Dog Bites You? | HEALTH NYOOOZ

గాయాన్ని బట్టి పరిహారం
హైకోర్టు ఆదేశాలతో గత 8 ఏళ్ల నుంచి వీధి కుక్కల బాధితులకు బీబీఎంపీ పరిహారం అందిస్తోంది. పరిహారాన్ని ఎలా లెక్కిస్తారంటే.. ప్రతి గాయానికి రూ.2 వేలు, లోతైన గాయమైతే రూ.3 వేలు, గాయాలు సంఖ్య ఎక్కువగా ఉంటే రూ.10 వేలు పరిహారం లభిస్తుంది. అలాగే చికిత్స వ్యయాన్ని కూడా బీబీఎంపీ భరిస్తుంది. ఒకవేళ కుక్క కరిచి పిల్లలు చనిపోతే రూ.50 వేలు, పెద్దలు చనిపోతే లక్ష రూపాయలు సదరు కుటుంబానికి అందించాలి. 2016 నుంచి ఏప్రిల్‌ 2022 వరకు బీబీఎంపీ పరిధిలో 32,161 మంది వీధి కుక్కల బారినపడ్డారు. వీరిలో కేవలం 25 మంది దరఖాస్తు చేసుకుని పరిహారం పొందారు.

25 మందికి.. రూ.15 లక్షలు అందజేశారు. 2016–17లో ఒక వ్యక్తిపై వీధి కుక్కలు దాడి చేశాయి, పరిహారం, చికిత్స వ్యయంతో కలిపి రూ.70,430ను పాలికె అందజేసింది. 2017–18 లో ముగ్గురికి కలిపి రూ.60,645 ఇచ్చింది. 2018–19లో విభూతిపురలో ప్రవీణ్‌ అనే బాలుడు వీధికుక్కల దాడిలో మృతిచెందాడు. ఆ కుటుంబానికి పరిహారం, ఆసుపత్రి వ్యయం తో కలిపి రూ.8,42,963 ముట్టజెప్పింది. 2019–20 లో 9 మందికి రూ.2,07,292, 2020–21 లో 7 మందికి రూ.2,22,540, 2021–22 లో నలుగురి కి రూ.85,431 పరిహారం ఇచ్చింది. ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం పరిహారం రూ.15 లక్షలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news