స‌మంత‌, ప్ర‌భాస్ తో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే

-

టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో గ‌త కొద్ది రోజుల నుంచి హీరోయిన్ పూజా హెగ్డే గురించి కొన్ని వార్తలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో పూజా హెగ్డే కు విభేదాలు ఉన్నాయ‌ని ఈ మ‌ధ్య కాలం ఎక్కువ వార్తలు వ‌స్తున్నాయి. స‌మంత‌తో పూజా హెగ్డే కు గొడ‌వ‌లు ఉన్నాయ‌ని చాలా రోజుల నుంచే ఒక పుకారు ఉంది. అలాగే ఇటీవ‌ల‌ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్. పూజా హెగ్డే రాధేశ్యామ్ సినిమాలో క‌లిసి న‌టించిన విషయం తెలిసిందే.

కాగ ఈ సినిమాతోప్ర‌భాస్, పూజా హెగ్డే ల మ‌ధ్య భేదాభిప్రాయాలు వ‌చ్చినట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజా గా ఈ వార్త‌ల‌పై హీరోయిన్ పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చింది. స‌మంత‌, ప్ర‌భాస్ తో స‌హా ఇండ‌స్ట్రీలో ఎవ‌రితోనూ ఎలాంటి విభేదాలు లేవ‌ని పూజా హెగ్డే తెలిపింది. సోషల్ మీడియాలో వ‌చ్చేవ‌న్నీ పుకార్లే నంటూ కొట్టిపారేసింది. స‌మంత త‌న‌కు మంచి స్నేహితురాల‌ని పూజా హెగ్డే చెప్పింది. అలాగే రాధేశ్యామ్ లో ప్ర‌భాస్ తో న‌టించాన‌ని తెలిపింది. ప్ర‌భాస్ లాంటి వ్య‌క్తితో గొడ‌వ‌లు పెట్టుకుంటారా.. అని పూజా హెగ్గే అన్నారు. త‌న‌కు ఇండ‌స్ట్రీలో ఎవ‌రితోనూ గొడ‌వ‌లు లేవ‌ని తెల్చి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news