పెన్షన్ పంపిణీలో నకిలీ నోట్ల కలకలం!

-

ప్రకాశం జిల్లాలో పెన్షన్లు పంపిణీ నగదులో నకిలీ నోట్లు రావడం కలకలం రేపింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నరసాయిపాలెం లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో వాలంటీరు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఓ లబ్ధిదారు పింఛను నగదుతో ఓ దుకాణానికి వెళ్లగా అందులో నకిలీ నోట్లు గుర్తించారు.

ఈ విషయాన్ని వారు వాలంటీరు దృష్టికి తీసుకువెళ్లగా.. ఆ పెన్షన్ పంపిణీ సొమ్ములో మరిన్ని నకిలీ నోట్లు కనిపించాయి. దీంతో గ్రామంలో 19 వేల విలువైన 500 నకిలీ నోట్లను లబ్ధిదారుల నుంచి వాలంటీరు తీసుకొని అధికారులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news