రేపు హైదరాబాద్ స్వాతంత్య్ర దినోత్సవం పేరిట కాంగ్రెస్‌ వేడుకలు

-

హైదరాబాద్‌ సంస్థానానికి స్వాతంత్ర్య సిద్ధించి 75ఏళ్లు అవుతున్న సందర్భంగా… ఏడాదంతా వజ్రోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. సెప్టెంబర్ 17న ఈ ఉత్సవాలను జరిపేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. నాటి ప్రధాని నెహ్రూ, హోంమంత్రి వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వంలోని తమ ప్రభుత్వం నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్‌ స్టేట్‌కు స్వాతంత్య్రం కల్పించిందని చెబుతున్న కాంగ్రెస్‌… హైదరాబాద్ స్వాతంత్య్ర దినోత్సవం పేరిట వేడుకలు జరపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రేపు గాంధీభవన్‌ వేదికగా జరగనున్న వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

తెరాస సర్కార్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్న కాంగ్రెస్‌… కొత్త రూపురేఖలతో విగ్రహాన్ని తయారు చేయించింది. వజ్రోత్సవాల్లో భాగంగా రేపు రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉన్న ఈ విగ్రహాన్ని… రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నూతన రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతోపాటుగా… రేపు గాంధీభవన్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ రూపొందించిన ప్రత్యేక జెండాను ఆవిష్కరించేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తులు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news