శంషాబాద్‌ వద్ద రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్‌ నేత కుమార్తె మృతి

-

హైదరాబాద్‌ నగర శివారు శంషాబాద్‌ పరిధిలోని శాతంరాయి వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఓ యువతి మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

మృతి చెందిన యువతిని టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ ఫిరోజ్‌ఖాన్‌ కుమార్తె తానియాగా గుర్తించారు. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news