హైదరాబాద్ మాదాపూర్‌లో కాల్పుల కలకలం..ఒకరు మృతి

-

హైదరాబాద్‌ మాదాపూర్‌ లోని తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనలో.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇస్మాయిల్‌ మృతి చెందగా, జహంగీర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇస్మాయిల్‌పై పాయింట్‌ బ్లాంక్‌లో కాల్పులు జరిపాడు రౌడీషీటర్.

ఇస్మాయిల్‌, జహంగీర్‌, మహ్మద్‌ల మధ్య రియల్‌ ఎస్టేట్‌ వివాదం ఉండటంతో ఈ వివాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. అయితే.. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఆ రౌడీ షీటర్‌ క్రైమ్‌ హిస్టరీ చెక్‌ చేసుకుంటూ.. ఈ కేసును ఛేదిస్తున్నారు. అసలు ఈ కాల్పుల ప్లానింగ్‌ ఎందుకు చేశారు.. ఏ వివాదం కారణంగా ఈ సంఘటన జరిగింది.. దీని వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా. మాదాపూర్‌ కాల్పులు హైదరాబాద్‌ నగరాన్ని ఒక్క సారి ఉలిక్కి పడేలా చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news