తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..ఇవాళే టీఎస్‌ ఈసెట్‌

-

తెలంగాణ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. టీఎస్‌ ఈసెట్‌ పరీక్షను ఇవాళ నిర్వహించనున్నట్టు కన్వీనర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి ప్రకటన చేశారు. పాలిటెక్నిక్‌, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి నేరుగా బీటెక్‌ సెకండియర్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 24,055 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు విజయ్‌కుమార్‌ రెడ్డి.

మొత్తం 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు విజయ్‌కుమార్‌ రెడ్డి. విద్యార్థులకు పాత హాల్‌టికెట్ల స్థానంలో కొత్తవి జారీ చేశామని వెల్లడించారు విజయ్‌కుమార్‌ రెడ్డి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కంప్యూటర్‌ సైన్స్‌, ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ అభ్యర్థులకు పరీక్ష ఉంటుందన్నారు విజయ్‌కుమార్‌ రెడ్డి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సివిల్‌, మెకానికల్‌, కెమికల్‌, మైనింగ్‌, మెటలర్జీ, ఫార్మసీ, బీఎస్సీ గణితం అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు విజయ్‌కుమార్‌ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news