సీఎం కేసీఆర్‌కు భారీ సన్మానం చేస్తా: కాంగ్రెస్ ఎమ్మెల్యే

-

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన… ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలని అన్నారు.

సంగారెడ్డి మెడికల్ కాలేజ్ కోసం మూడేళ్లు పోరాటం చేశానన్నారు. తన కూతురుతో కలిసి ట్యాంక్ బ్యాండ్ నుంచి అసెంబ్లీకి పాదయాత్ర చేశానని జగ్గారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఈ మెడికల్ కాలేజ్దాదాపు 10 నియోజకవర్గాల ప్రజలతోపాటు కర్ణాటకలోని బీదర్ నుండి వచ్చే ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.మెడికల్ కాలేజ్‌కు ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు.

సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఉన్న భూముల్లోనే నిర్మాణం చేయాలన్న జగ్గారెడ్డి… మెడికల్ కాలేజీకి సీఎం శంకుస్థాపన చేయాలని అన్నారు. శంకుస్థాపనకు వచ్చిన రోజు కేసీఆర్ అనుమతితో భారీ సన్మానం చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తే నేరుగా వెళ్లి కలుస్తానని, వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుకుంటానని అన్నారు.అయితే దీనికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తన వ్యక్తిగతమని జగ్గారెడ్డి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news