జోడో యాత్ర ఆపి హిమాచల్‌కు రండి రాహుల్ : కాంగ్రెస్ ఎంపీ

-

రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రపై ఇప్పటి వరకు బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీయే సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేపుతోంది.

‘జోడో యాత్ర మళ్లీ చేయొచ్చు.. మరోసారి అక్కడి ప్రజల్ని జాగృతం చేయొచ్చు.. దాని కన్నా ముందు ఎన్నికలు జరుగుతున్న హిమాచల్‌, గుజరాత్‌లలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించే పనిని చేపట్టండి’ అని రాహుల్‌ గాంధీకి దక్షిణ గోవా కాంగ్రెస్‌ ఎంపీ ఫ్రాన్సిస్కో సార్డిన్హా సూచించారు. జోడో యాత్రను ఆపేయాల్సిందిగా రాహుల్‌ గాంధీకి సూచించారు.

హిమాచల్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో ప్రజలు ఓటు వేసేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఇక్కడ ప్రజలను జాగృతం చేయడానికి బదులుగా.. అక్కడి ఓటర్లను కలుసుకుని తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వేడుకోవడం ఇప్పుడు అవసరమని చెప్పారు. ఆ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించాలంటే తాము చాలా కష్టపడాల్సి ఉంటుందని, పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయడంలో తన పూర్తి సమయం కేటాయించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news