75 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది: జీవన్ రెడ్డి

-

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 75 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ కనుమరుగవుతుందని, కుటుంబ పాలన అంతం అవుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ కు తన పనితనం మీద విశ్వాసం లేదా ఎందుకని పీకే ని తీసుకువచ్చాడని ప్రశ్నించారు.

అటు నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యల పైన జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రపంచం ముందు దేశం తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు. తాము కూడా శ్రీరాముడి భక్తులమేనని, కానీ ఇస్లాం మతాన్ని కించపరచమని తెలిపారు.నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఆమె నోరు నుంచే వచ్చినా.. ఈ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఆలోచన విధానానికి ప్రతిబింబం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news