పంజాబ్‌లో అగ్రి చట్టాల సెగ బీజేపీకి గట్టిగా తగిలిందా

-

పంజాబ్‌లో బీజేపీకి గట్టిషాక్ తగిలింది.పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరీ మోగించింది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్న వేళ.. వారి ఆందోళనలు..పంజాబ్‌ మున్సిపోల్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి..అగ్రి చట్టాల సెగతో బీజేపీ ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది.

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో పంజాబ్‌ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న వేళ.. ఆ రాష్ట్రంలో బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. మున్సిపోల్స్‌లో బీజేపీ ఓటమి చవిచూసింది. మొత్తం 8 మున్సిపల్‌ కార్పొరేషన్లలో 7 చోట్ల కాంగ్రెస్‌ నెగ్గింది. మరోచోట ఫలితం వెలువడాల్సి ఉంది. ఈ ఫలితాల్లో బీజేపీ రెండో స్థానాన్ని సాధించలేకపోయింది.

రాష్ట్రంలోని మొత్తం 8 మున్సిపల్‌ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లోని 2 వేల 302 వార్డులకు… ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగాయి.అబోహర్‌, బటిండా, కపూర్తల, హొషియార్‌పుర్‌, మోగ మున్సిపల్‌ కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మరో రెండు కార్పొరేషన్లు బటాలా, పఠాన్‌కోట్‌ల‌ను తన ఖాతాలో వేసుకుంది. నగర పంచాయతీల్లోనూ చాలా చోట్ల కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉండగా.. శిరోమణి అకాళీదళ్‌, ఆమ్‌ఆద్మీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.బీజేపీ

బటిండా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించింది. 53ఏళ్లలో తొలిసారిగా ఇక్కడ మేయర్‌ పదవిని దక్కించుకుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు 43 స్థానాలు రాగా.. శిరోమణి అకాలీదళ్‌ 7 చోట్ల గెలుపొందింది. దీంతో మేయర్‌ పదవి హస్తం పార్టీ కైవసం చేసుకుంది.

మొహాలీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని రెండు పోలింగ్‌ కేంద్రాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో… అక్కడ మంగళవారం రీపోలింగ్‌ నిర్వహించారు. దీంతో ఈ కార్పొరేషన్‌లో ఓట్ల లెక్కింపు ఆలస్యం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news