యువతిపై కానిస్టేబుల్ అత్యాచార యత్నం

-

సత్యసాయి జిల్లా కదిరిలో దారుణం చోటు చేసుకుంది. మహిళలను రక్షించాల్సిన పోలీసులే కామాంధులుగా మారారు. నిన్న కానిస్టేబుల్ రాత పరీక్ష రాసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు కదిరి రైల్వేస్టేషన్కు చేరుకున్న ఓ యువతిపై కానిస్టేబుల్ కాయప్ప, హోంగార్డు సుబ్బారెడ్డిలు అత్యాచారానికి యత్నించారు. ఆమె తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

ఇదిలా ఉంటే.. దిల్లీలో మరో ఘటన చోటు చేసుకుంది. దిల్లీకి చెందిన ఓ యువతి.. ఉత్తరాఖండ్​కు చెందిన నౌషాద్ ఖురేషీ అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ ఏడాదిన్నరగా కలిసి జీవిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని బాధితురాలిని నమ్మించి నౌషాద్​ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి రెండు సార్లు గర్భవతి అవ్వగా.. అబార్షన్​ చేయించాడు నిందితుడు. మూడో సారి కూడా బాధితురాలు గర్భవతి కావడం వల్ల అబార్షన్ చేసుకోమని ఒత్తిడి చేశాడు. అంతేగాక నిందితుడి తండ్రి, సోదరుడు.. మతం మారాలని యువతిని ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులకు నిందితులపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు నౌషాద్ ఖురేషీని అదుపులోకి తీసుకున్నారు. అతడి తండ్రి షానవాజ్​, జహీర్ ఖురేషీని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news